Breaking News

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలు 2 వారాలు వాయిదా

andhra-pradesh-dsc-exams-postponed-telugumaterial.in

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షలను 2 వారాలు వాయిదా వేసున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

  • డీఎస్సీ ప్రకటనకు పరీక్షకు మధ్య సమయం తక్కువగా ఉన్నందున చదువుకునేందుకు సమయం కావాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
  • మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
  • కొత్త షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.
  • ఈ వాయిదా కారణంగా పరీక్షా కేంద్రాల ఐచ్ఛికాల సమయం సైతం మారనుంది.
  • డీఎస్సీ అన్ని పోస్టులు కలిపి 7729 ఉండగా వీటికి 6,08,157 మంది దరఖాస్తు చేసుకున్నారు.

No comments