కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC) గా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా సుధీర్ భార్గవను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జనవరి 1న ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
- నాలుగేళ్లపాటు సుధీర్ సీఐసీగా కొనసాగనున్నారు.
- 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
- సామాజిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
- 2015 జూన్ నుంచి కేంద్ర సమాచార కమిషన్లో సమాచార కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
- సమాచార కమిషనర్లుగా నలుగురు మాజీ ఉన్నతాధికారుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.
- సీఐసీలో ప్రధాన సమాచార కమిషనర్తో కలిపి మొత్తం 11 మంది సమాచార కమిషనర్లు ఉండవచ్చు. తాజా నియామకాలతో వారి సంఖ్య 7కు చేరుకుంది.

No comments