Breaking News

ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ 16-జులై-2019

important-current-affairs-in-telugu-16-july-2019-telugumaterial.in

  • సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అర్జన్‌ కుమార్‌ సిక్రీ సింగపూర్‌‌లోని అంతర్జాతీయ కమర్షియల్‌ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు. 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.




  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన భాజాపా సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా(78) హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌‌గా నియమితులయ్యారు.




  • గుజరాత్ రాష్ట్ర గవర్నర్‌‌గా ఆచార్య దేవవ్రత్(60) నియమితులయ్యారు.




  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌‌గా ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి, రచయిత,న్యాయవాది అయిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు.




  • ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర గవర్నర్‌‌గా రాజ్యసభ సభ్యురాలు అనసూయా ఊకే (62) నియమితులయ్యారు.




  • జులై 15 నుంచి తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. దేశంలో ఇప్పటివరకు 24 రాష్ట్రాల్లో 334 ప్రవేట్ వర్సిటీలున్నాయి. తెలంగాణ 25వ రాష్ట్రం కానుంది.

No comments