ఏఈఆర్సీ ఛైర్మన్గా గుంటూరు నాగేశ్వరరావు నియామకం
అణు ఇంధన నియంత్రణ మండలి (ఏఈఆర్సీ) ఛైర్మన్గా గుంటూరు నాగేశ్వరరావు నియమితులయ్యారు.
- ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
- అణు ఇంధన భద్రతా వ్యవహారాల్లో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పదవిలో నియమించింది.
- ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
- ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న ఎస్ఏ భరద్వాజ్నుంచి త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
- నాగేశ్వరరావు ప్రస్తుతం కల్పాకంలో ప్రాజెక్ట్ డిజైన్ సేఫ్టీ కమిటీ, ప్రోటోటైప్ ఫాస్ట్బ్రీడర్ రియాక్టర్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గుంటూరు నాగేశ్వరరావు:
- నాగేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు.
- తండ్రి సాధారణ రైతు.
- ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ప్రాథమికోన్నత విద్య రేవేంద్రపాడు జడ్పీ స్కూల్లో సాగింది.
- విజయవాడ ఆంధ్రలయోలా కాలేజీలో పీయూసీ, అనంతపురం జేఎన్టీయూలో ఇంజినీరింగ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ చేసారు.
- అనంతపురం జేఎన్టీయూలో తొలి బ్యాచ్ విద్యార్థి. 1969 నుంచి 1975 వరకు అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
- కెరీర్ ప్రారంభంలో అణు ఇంధనశాఖలో చేరారు.
- తర్వాత డిప్యుటేషన్పై దాని అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఎల్కి వెళ్లారు. అందులోనే శాశ్వతంగా ఉండిపోయారు.
- అందులోనే రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలోని అణు ఇంధన విద్యుత్తు కేంద్రాల్లో పనిచేసారు.
- తర్వాత ఎన్పీసీఎల్లో పాలకమండలిలో డైరెక్టర్గా నియమితులయ్యారు.
- ఆగష్టు 2007 నుంచి పదవీ విరమణ పొందేవరకు అక్కడే ఉన్నారు.
- కొన్నాళ్లు ఎన్టీపీసీకి భద్రతా సలహాదారుగా, అనంతరం యూపీలోని ఎన్టీపీసీకి కొన్ని రోజులపాటు సేవలందించారు.

No comments